NLR: కావలి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.