ప్రకాశం: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా ఆదివారం కనిగిరి పట్టణంలోని బొడ్డు చావడి వద్ద ఉన్న రాములు విగ్రహానికి కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర తెలుగువారికి ప్రత్యేక రాష్ట్ర సాధనకై అమర నిరాహార దీక్ష చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒలేటి చిన్న, ఆర్యవైశ్య నాయకులు, పాల్గొన్నారు.