తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి, నారాయణస్వామి, ఎంపీ గురుమూర్తి పాల్గొని వినతి పత్రం అందజేశారు. చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమైతే సంబంధిత వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.