E.G: రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాల మేరకు ‘మొంథా’ తుఫాన్ నేపధ్యంలో గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల గ్రామంలో ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ఇళ్లకు ముందస్తు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో 4 కుటుంబాలను స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు.