అన్నమయ్య: సబ్రిజిస్ట్రార్ గురుస్వామి నాయుడును డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసిన ఇద్దరిపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో చిత్తూరు పెన్ పవర్ రిపోర్టర్ దొరస్వామి, రిటైర్డ్ సబ్రిజిస్ట్రార్ కోదండరాం పేర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలంగా లక్షల్లో డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు అందండంతో కేసు నమోదు చేశారు.