PPM: సాలూరులో వంద పడకల ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి ఇవాళ ప్రారంభం కానుంది. సుమారు రూ.17 కోట్ల నాబార్డ్ నిధులతో నిర్మించబడ్డ ఆసుపత్రి భవనాలను ఇవాళ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు ఆసుపత్రి వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి. ఈ ఆసుపత్రి ప్రారంభంతో పడకల కొరత తీరుతుందని ఆసుపత్రి కమిటీ సభ్యులు తెలిపారు.