GNTR: అమావాస్య సందర్భంగా, మంగళగిరి జ్వాలా నారసింహుడి దర్శనం కోసం ఘాట్ రోడ్డులో వాహనాలకు అనుమతి సమయాన్ని దేవస్థానం ఈవో సునీల్ కుమార్ ప్రకటించారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే భక్తులను ఘాట్ రోడ్డులో అనుమతిస్తామని సోమవారం తెలిపారు. భక్తులు ఈ సమయాన్ని పాటించి, సిబ్బందికి సహకరించాలని ఈవో కోరారు.