కర్నూలు నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ప్రారంభించారు. ఏ. క్యాంప్లోని డ్రైనేజ్ కాలువల శుభ్రత పనులను పరిశీలించారు. చెత్త, పూడిక తొలగింపు, దోమల నివారణ చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలు కూడా పరిశుభ్రతలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.