PPM: గిరిజనులు సాగు చేసిన కొండచీపురుల రవాణాలో అటవీశాఖ అధికారులు 10వేల రూపాయలు అక్రమంగా వసూలు చేశారని కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు ఆరోపించారు. వబ్బంగి పంచాయతీ తోలుంగూడ గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజనుల వాహనాన్ని చినబగ్గ కాలనీ వద్ద అడ్డగించి డబ్బు తీసుకున్న ఘటనను ఖండించారు.