భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల విద్యుత్ కార్యాలయంలో లైన్మెన్ దివాస్ వేడుకలు బుధవారం నిర్వహించారు. డీఈ రంగస్వామి, ఏడీఈ రఘురామయ్య ఆధ్వర్యంలో విద్యుత్ సిబ్బందిని సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులు సూచించారు.