PDPL: ధర్మారం మండలం మేడారంలో బుధవారం శ్రీ శివపార్వతుల కల్యాణోత్సవం సందర్భంగా ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. మహిళలు కోలాటాలు వేస్తూ డీజే పాటలకు నృత్యాలు చేస్తూ వైభవంగా ఊరేగింపులో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రధాన రహదారి గుండా చేపట్టిన ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించారు.