SKLM: పాతపట్నం నియోజకవర్గ ప్రజల దీర్ఘకాల కోరిక నెరవేరింది. ఇవాళ ఉదయం 10 గంటలకు రాజ్య రాణి ఎక్స్ప్రెస్ ట్రైన్ పాతపట్నంలో హాల్ట్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.