PPM: జిల్లా కేంద్రంలో నీటి వనరులకు రక్షణ కరువవుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఆదివారం వరల్డ్ వాటర్ డే సందర్భంగా ఆ పార్టీ DCC జిల్లా అధ్యక్షులు వంగల దారినాయుడు పట్టణంలోని నెల్లిచెరువును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నీటి వనరులైన చెరువులు, గెడ్డలకు రక్షణ కరువవుతోందన్నారు. మున్సిపాలిటీలోని పలు చెరువులు కబ్జాకు గురవుతున్నాయని చెప్పుకొచ్చారు.