CTR: పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. వేద పండితులు హోమాధి కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత అమ్మవారి మూల విగ్రహాన్ని అభిషేకించి, ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకోగా అర్చకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.