కృష్ణా: మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధి ఈడేపల్లిలో గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు సాయి గణేష్ అనే వ్యక్తిపై ట్యూబ్ లైట్తో దాడికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం.. సాయి గణేష్ బాగా చదువుకుంటున్నాడనే అక్కసుతో ఈ దాడి జరిగింది. గతంలో స్నేహితులుగా ఉన్న సాయి గణేష్, సోమశేఖర్, కన్నా మధ్య గొడవలు తలెత్తడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.