నెల్లూరు: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం వార్షిక క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఈ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభ, జట్టు భావన, క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ సుజాత తెలియజేశారు. ఈ కార్యక్రమం చాలా ఆనందభరిత వాతావరణంలో ముగిసినట్లు తెలిపారు.