ELR: నూజివీడు రైతులకు రేపు సుమారు రూ.20 కోట్ల మేర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయంగా అందించనున్నట్లు వ్యవసాయ అధికారి చెన్నారావు తెలిపారు. ఆయన నూజివీడులో గురువారం మాట్లాడుతూ.. 35,529 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకంలో రూ.14.21 కోట్లు, కేంద్రం అందించే పీఎం కిసాన్లో రూ.5.56 కోట్లు, మొత్తం రూ.19.77 కోట్లు రైతుల ఎకౌంట్లో జమ కానున్నట్లు పేర్కొన్నారు.