GNTR: కొల్లిపర మండలం అత్తులూరి వారి పాలెం వద్ద గురువారం రాత్రి జరిగిన బైక్ అదుపుతప్పి ప్రమాదంలో తూములూరు గ్రామానికి చెందిన రాజా అనే వ్యక్తి గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించారు. సిబ్బంది క్షతగాత్రుడిని కొల్లిపర సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, ఆయనకు ప్రథమ చికిత్స అందించారు.