VZM: తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు కోరారు. శనివారం గజపతినగరంలో ‘బడి పిలుస్తుంది’ కార్యక్రమంలో భాగంగా డీఈవో క్యాంపన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులకు పిల్లల పాఠశాల ప్రవేశ పత్రాలను అందజేశారు. ఎంఈవోలు విమలమ్మ, సాయి చక్రధర్, పలువు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.