కృష్ణా: మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది వీడ్కోలు సభ శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ.. ఇప్పటివరకు వీరంతా విధి నిర్వహణలో నిరంతరాయంగా మీతో గడిపే సమయం కూడా లేకుండా విధుల్లో నిమగ్నం అయ్యారని, విరమణ అనంతరం వారికి ప్రశాంత జీవితం అందజేయాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపై ఉందని తెలిపారు.