SKLM: సోంపేట మండలం బారువా గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి పనులు పూర్తి చేయాలని ఇచ్ఛాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త శ్యాంప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం గ్రామంలో పర్యటించిన వైసీపీ నేతలు తమ ప్రభుత్వ హయాంలో 80 శాతం పనులు పూర్తిచేసిన కూటమి మిగిలిన పనులను పూర్తి చేయకుండా జాప్యం చేస్తుందని ఎద్దేవా చేశారు, రోగులకు వైద్య వసతులు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.