KDP: PGRS కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చిన అర్జీలు సత్వరమే పరిష్కారం చేయాలని కడప ఆర్టీవో మురళి తెలిపారు. ఇవాళ సిద్ధవటం MRO కార్యాలయాన్ని RDO తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ రెవెన్యూ డికెటి పొలాలను ఆక్రమితకు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్రమితకు గురైన ప్రదేశాలు గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని MROకు సూచించారు.