కర్నూలు కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర, దేశ పరిణామాలపై అవగాహన లేకుండా వైసీపీ వర్గాల సమాచారం ఆధారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.