KKD: జీజీహెచ్లో ప్రస్తుత కొవిడ్ దశ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం వరకు మొత్తం 399 ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా 54 మందికి కోవిడ్ నిర్ధారణ అయిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. లావణ్యకుమారి తెలిపారు. ప్రస్తుతం ఆరుగురు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారన్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.