KRNL: పత్తికొండ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వై. మధుబాబు నేతృత్వంలో మంగళవారం నాలుగు స్తంభాల కూడలిలో న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. ఎమ్మిగనూరు న్యాయవాది గురు రాజారావుపై జరిగిన దాడిని ఖండిస్తూ, దాడి చేసినవారిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. న్యాయవాదుల చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తూ, ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.