KRNL: కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఢిల్లీలోని కార్యాలయంలో కలిశారు. జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పడిన సమస్యలు, అభివృద్ధిపై వివరాలు చెప్పి వినతిపత్రం అందజేశారు. గ్రామీణ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఎంపీ నాగరాజు విజ్ఞప్తి చేశారు.