E.G: కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలపై అధికంగా అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని అమలాపురం పార్లమెంట్ వైసీపీ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. మంగళవారం రాజానగరం మండలంలోని లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద మహిళలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.