KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ.7930 పలికింది. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా పత్తి కనిష్ఠ ధర రూ.5080, వేరుశనగ గరిష్ఠ ధర రూ.5,279, కనిష్ఠ ధర రూ.4580 పలికింది. ఆముదాలు క్వింటా గరిష్ఠ ధర రూ.5370 పలికింది. మార్కెట్లో 148 క్వింటాల పత్తి, 14 క్వింటాల వేరుశనగ కొనుగోలు జరిగినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.