E.G: తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. ఇందులో టీడీపీ నాయకులు పెండ్యాల అచ్చిబాబు పాల్గొన్నారు.