మన్యం జిల్లాలో నాణ్యమైన, పారదర్శకమైన ఓటర్ల జాబితాకు సహకరించాలని DRO కె. హేమలత తెలిపారు. సోమవారం తన ఛాంబర్లో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి నెలా DEO/ERO స్థాయిలో అన్ని పార్టీ సమావేశాలను నిర్వహించాలని, ప్రాధాన్యంగా మొదటి వారంలో నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశించినట్లు తెలిపారు.