E.G: నిడదవోలు మాలకోడులో రూ. 105 కోట్ల వ్యయంతో మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి CM చంద్రబాబు నాయుడు హాజరవుతారని వెల్లడించారు. సమావేశంలో వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.