కాకినాడలో ఫైవ్ స్టార్ హోటల్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తాజ్ బ్రాండ్తో రూ.104 కోట్ల పెట్టుబడితో 3.4 ఎకరాల్లో హోటల్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం పలు రాయితీలు ప్రకటించింది. సర్వే పూర్తై, త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. మరిన్ని సంస్థలు కూడా పెట్టుబడులకు ముందుకొస్తున్నాయి. దీంతో జిలాలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందనుంది.