ATP: గుత్తిలోని తాడిపత్రి రోడ్డులో గురువారం దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రోజు వరుసగా మూడు దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. మురళీకృష్ణ జనరల్ స్టోర్స్, గంగా గౌరి ట్రేడర్స్, శ్రీ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ షాపుల తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. దుకాణాల్లో ఉన్న నగదుతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.