SKLM: ఎచ్చెర్ల మండలం కొంగరం పంచాయతీలో గ్రామ దేవత శ్రీ పరదేశమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని మాజీ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు ఆయన తెలిపారు. ఆయనతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.

