TPT: కమిషనర్ మౌర్య తిరుపతి నగరంలోని పలు ప్రదేశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొర్లగుంటలో పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, కాలువల నిర్వహణ ఎలా జరుగుతుందో స్థానిక పౌరులను అడిగి తెలుసుకున్నారు. తడి చెత్త, పొడి చెత్త గురించి వివరించారు. చెత్త సేకరణకు సిబ్బంది ఏ సమయంలో వస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.