VSP: ఏయూ ఫైన్ ఆర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులు రూపొందించిన ‘రెసినంట్ స్పేసెస్’ వార్షిక చిత్రకళా ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. ప్రముఖ చిత్రకారులు, పూర్వ ఆచార్యులు వి. రమేష్ ముఖ్య అతిథిగా హాజరై దీనిని ప్రారంభించారు. కళాకారులు సమాజానికి కొత్త ఆలోచనలు అందించాలని, విద్యార్థుల చిత్రాలు, శిల్పాలు వారి ప్రతిభకు అద్దం పడుతున్నాయన్నారు.