సత్యసాయి: సోమందేపల్లి మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జాతీయ రహదారి నుంచి వెలగమేకలపల్లి గ్రామం వరకు రూ.1.48 కోట్ల నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు బుధవారం కూటమి నాయకులు, అధికారులు భూమిపూజ నిర్వహించారు. దశాబ్దాలుగా ఉన్న రవాణా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేసింది.