ప్రకాశం: మార్టూరు మండలం కోనంకి నీటి సంఘం ఎన్నికల్లో ఛైర్మన్గా గెలుపొందిన శ్రీరాములు, వైస్ ఛైర్మన్ చక్రపాణి ఆదివారం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి వారిని అభినందించారు. ఈ సందర్భంగా రైతులకు సాగునీటిని చివరి భూములు వరకు అందించేందుకు కృషి చేయాలని సూచించారు.