E.G: కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో రామాలయం వద్ద అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు హాజరై పడిపూజ కార్యక్రమానికి రూ. 25 వేలు ఆర్థిక సహాయం అందించారు. ముందుగా ఆయనకు గ్రామ పెద్దలు స్వాగతం పలికారు.