CTR: చిత్తూరులోని కస్తూర్భా బాలికల నగర పాలకోన్నత పాఠశాల విద్యార్థినిలు మంగళవారం ఓజోన్ డే అవగాహన ర్యాలీని నిర్వహించారు. హెచ్ఎం రమాదేవి విద్యార్థినిలకు ఓజోన్ పొర ప్రాముఖ్యతను వివరించారు. సూర్యరశ్మి నుంచి వచ్చే అతినీలలోహిత హానికరమైన కిరణాలనుంచి ఓజోన్ పొర జీవరాసులను రక్షిస్తుందన్నారు. ఈ పొర రోజు రోజుకి క్షీణిస్తోందన్నారు.