W.G: ఇటీవల విడుదలైన ఏపీ పీజీ సెట్ ప్రవేశ పరీక్షలో తణుకు పట్టణానికి చెందిన గుబ్బల శిరీష రాష్ట్రస్థాయిలో 50వ ర్యాంకు సాధించింది. తణుకు మారుతీ డిగ్రీ కళాశాలలో చదువుతున్న ఆమె ఈ ఘనత సాధించినట్లు కళాశాల ఛైర్మన్ ఎస్.వి.వి.సత్యనారాయణ, ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.కనకయ్య తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.