కోనసీమ: అయినవిల్లి మండలం క్రాప గ్రామానికి చెందిన చిక్కం లక్ష్మీ ఇటీవల జరిగిన ఏపీ డీఎస్సీ-2025 పరీక్షలో స్కూల్ అసిస్టెంట్ హిందీ పండిట్ విభాగంలో జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అంతే కాకుండా తాను చదువుకున్న కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్లోనే పోస్టింగ్ దక్కించుకోవడం విశేషం. తాను చదువుకున్న క్లాస్ రూమ్లోనే తను విద్యార్ధులకు పాఠాలు చెప్పనుంది.