GNTR: తిరుపతి దేవస్థానానికి నెయ్యి పంపిణీ చేయడం హర్షణీయం అని సంగం డెయిరీ ఛైర్మన్, MLA ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అధిక భక్తులున్న శ్రీవారి ప్రసాదంలో సంగం నెయ్యి ఉపయోగించే అరుదైన అవకాశాన్ని పొందటం జిల్లా రైతులు, ప్రజల ఆత్మగౌరవంగా భావిస్తున్నామన్నారు. వడ్లమూడి సంగం డెయిరీలో గురువారం టీటీడీకి పంపనున్న వాహనాన్ని ప్రారంభించారు.