NLG: జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగులతో సహా అన్ని రకాల చేయూత/ఆసరా పింఛన్ల పంపిణీ ఈనెల 30వ తేదీ వరకు జరుగుతుందని DRDO శేఖర్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారులు పింఛన్లు మొత్తాన్ని నేరుగా పోస్టల్ శాఖ వారి నుంచి మాత్రమే పొందాలన్నారు. మధ్య దళారులను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.