CTR: వెదురుకుప్పం మండల అభివృద్ధికి సహకరించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కోరినట్లు TDP మండలాధ్యక్షుడు మోహన్ మురళి తెలిపారు. రాయచోటిలో మంత్రిని ఆయన గురువారం కలిశారు. ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆదేశాల మేరకు మంత్రిని కలిసినట్లు వెల్లడించారు. మండల అభివృద్ధిపై నివేదిక అందజేసినట్లు ఆయన తెలియజేశారు.