SKLM: విజ్ఞత మరచిపోయి అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడడం సమంజసం కాదని శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. గురువారం నరసన్నపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మాటల్లో ఆయన యొక్క విజ్ఞత స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. జగన్ని సైకో గాడు అనడం ఆయనకు సరికాదని ఘాటుగా విమర్శించారు.