KDP: జిల్లాలో సామాజిక రుగ్మతలను సమూలంగా తొలగించడమే లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్, ఎస్పీ విశ్వనాథ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసులలో బాధితులకు న్యాయంతో పాటు పరిహారం అందేలా చూడాలన్నారు.