కోనసీమ: రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలో జరిగింది. సంస్థ డైరెక్టర్లుగా రాష్ట్ర వ్యాప్తంగా 12 మందిని ఎంపిక చేయగా వారంతా సంస్థ ఛైర్మన్ వేగుళ్ళ లీలా కృష్ణ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశేట్టి సుభాష్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ల సమక్షంలో డైరెక్టర్లుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.