VSP: విశాఖ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించ కపోవడంతో శుక్రవారం నుంచి విధులు బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నఆందోళనలో 10 పీహెచ్సీలకు చెందిన సుమారు 20 మంది వైద్యులు పాల్గొంటున్నారని అసోసియేషన్ నాయకుడు డాక్టర్ జగదీష్ తెలిపారు.