SKLM: ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో ఆమదాలవలస మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ 3.20 లక్షల చెక్కులను లబ్ధిదారులు అందజేశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.